Monday, April 29, 2024

గుండెపోటుతో ఏడవ తరగతి విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గుండెపోటుతో ఏడవ తరగతి విద్యార్థిని మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే కంజర గ్రామానికి చెందిన మైథిలి మోపాల్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది. దసరా సెలవులు రావడంతో శుక్రవారం ఇంటికి వచ్చింది. సాయంత్రం తన స్నేహితులతో ఆడుకుంటుండగా ఒక్కసారిగా చాతిలో నొప్పి వచ్చింది. నొప్పి వస్తుందని మైథిలి తన తల్లికి చెప్పడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు విద్యార్థిని పరిశీలించి అప్పటికే చనిపోయిందని తెలిపారు. శనివారం గ్రామంలో మైథిలి అంత్యక్రియలు నిర్వహించగా.. పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News