Saturday, April 27, 2024

పార్టీ, ప్రజల కోసం పాటుపడండి

- Advertisement -
- Advertisement -

CM KCR gave B form to Sujata

 

రామలింగారెడ్డి ఆశయాల
సాధనకు కృషి చేయండి
బీ ఫాం అందిస్తూ దుబ్బాక
అభ్యర్థి సుజాతతో సిఎం
కెసిఆర్ ముఖ్యమంత్రి
ఆశీస్సులతో భారీ మెజారిటితో
గెలుస్తా : సోలిపేట సుజాత

మనతెలంగాణ/హైదరాబాద్: దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టిఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బిఫామ్ ఇచ్చారు. బుధవారం ప్రగతి భవన్‌లో సోలిపేట సుజాత మంత్రి హరీష్‌రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్‌ఎ పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ దుబ్బాక టిఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు బిఫామ్ ఇచ్చారు. సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాక అభివృద్ధికోసం నిరంతరం శ్రమించారని గుర్తు చేశారు. అలాగే కృషిచేయాలని సుజాతకు సిఎం కెసిఆర్ చెప్పారు. పార్టీకోసం, ప్రజలకోసం పాటుపడాలన్నారు.

జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లేటప్పుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేసి అధిక మెజారిటీతో గెలవాలని చెప్పారు. బి ఫామ్ అందుకున్న సుజాత మాట్లాడుతూ దివంగతం మాజీ ఎంఎల్‌ఏ సోలిపేట రామలింగారెడ్డి ఇచ్చిన ప్రోత్సాహం ఆశీస్సులు అదేవిధంగా కొనసాగిస్తూ సిఎం కెసిఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానన్నారు. సిఎం కెసిఆర్ ఆశీస్సులతో ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తాననే ధీమాను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసిన వారిలో ఎంఎల్‌సి ఫరూఖ్ హుస్సేన్,రాష్ట్ర నాయకులు బక్కి వెంకయ్య, రాజమౌళి పంతులు తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News