Thursday, May 9, 2024

మరింత వేగం పెంచండి

- Advertisement -
- Advertisement -

శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు తప్పని పరాభావం 
ఆర్‌ఎస్‌ఎస్ ఆశీస్సులున్నా గడ్కరీని తప్పించిన మోడీ, షా ద్వయం

లక్ష్మణ్‌కు రెండు కమిటీల్లో చోటు

మనతెలంగాణ/ హైదరాబాద్: నాణ్యతలో ఏ మాత్రం రాజీపడకుండా నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సెక్రటేరియట్‌లోని అన్ని విభాగాల పనులను అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. సెక్రటేరియట్‌లో జరుగుతున్న నిర్మాణాలన్నింటినీ ముఖ్యమంత్రి కలియ తిరుగుతూ నిశితంగా పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కావద్దని పేర్కొన్నారు. స్లాబుల నిర్మాణం, భవనం పైన డూమ్స్ ఏర్పాటు, ఇంటీరియర్ పనులతోపాటు ఫర్నీచర్ విషయంలో నూతన మోడల్స్ ఎంపిక చేసుకోవాలని సిఎం సూచించారు. తొలుత నిర్దేశించుకున్న డిజైన్ల ప్రకారం పనులు జరుగుతున్నాయా? అని మంత్రిని, అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఏకకాలంలో అన్ని పనులు వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రుల ఛాంబర్లు, మీటింగ్ హాల్స్, యాంటీ రూమ్స్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భవనం మధ్య భాగంలో దాదాపు 2 ఎకరాల ఖాళీ స్థలంతో పాటు, సెక్రటేరియట్ ప్రాంగణంలో గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ పనులు అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రిల్స్ నిర్మాణ పనుల నాణ్యత గురించి సిఎం ఆరా తీశారు. రెడ్ స్టోన్, డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. విజిటర్స్ లాంజ్ నిర్మాణ పనులను, సెక్రటేరియట్ వాల్ వెంబడి మట్టి ఫిల్లింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సెక్రటేరియట్ కు వచ్చే విదేశీ ప్రతినిధులు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు సౌకర్యవంతంగా ఉండేలా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.

వివిధ జిల్లాల నుంచి సెక్రటేరియట్‌కు వచ్చే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారు. మంత్రులు, కార్యదర్శులు, ఆయా శాఖల సిబ్బంది సౌకర్యవంతంగా పనులు చేసుకునేందుకు వీలుగా ఛాంబర్ల నిర్మాణం చేపట్టాలన్నారు. నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్‌లోనే.. పనులు జరుగుతున్న తీరు గురించి సిఎం కెసిఆర్ సమీక్ష జరిపారు. పనులకు సంబంధించిన ఆల్బమ్ ను పరిశీలిస్తూ, ఒక్కో పని గురించి సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, నవీన్‌కుమార్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కె.పి.వివేకానంద, బేతి సుభాష్ రెడ్డి, ఎ.జీవన్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ వేద సాయిచంద్, ఆర్‌అండ్‌బి ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, జిహెచ్‌ఎంసి మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

CM KCR Inspects Secretariat Construction Works

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News