Wednesday, May 8, 2024

సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన పొడిగింపు..

- Advertisement -
- Advertisement -

Foundation stone of TRS office in Delhi

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ రాజధాని ఢిల్లీ పర్యటన మరో రెండు రోజులు కొనసాగనుంది. శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సిఎం కెసిఆర్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధాని మోడీతో సిఎం కెసిఆర్ చర్చించనున్నారు. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ తో సిఎం కెసిఆర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా గోదావరి, కృష్ణానదీ జలాల వ్యవహారం, కేంద్ర గెజిట్ తోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై కెసిఆర్ చర్చించనున్నారు. ఇక, రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సిఎం కెసిఆర్ భేటీ కానున్నారు.

CM KCR may extend Delhi tour to meet PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News