- Advertisement -
హైదరాబాద్: పట్టభద్రుల ఎంఎల్ సి ఎన్నికలపై టిఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పట్టుభద్రులను చైతన్యం చేసి, టిఆర్ఎస్ బలపర్చిన వారినే విజయం వరించేలా ఆ పార్టీ వ్యూహరచన చేసింది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం తోపాటుగా హైదరాబాద్, మహబూబ్నగ్, రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో టిఆర్ ఎస్ బలపర్చిన వారినే గెలిపించాలని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాలకు చెందిన టిఆర్ఎస్ నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ స్థాయి నాయకులతో ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఎంఎల్ సి, కార్పొరేషన్ ఎన్నికలపై సిఎం చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఆరు ఉమ్మడి జిల్లాల టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
CM KCR meets with public representatives at Pragathi Bhavan
- Advertisement -