Tuesday, April 30, 2024

విజయవంతంగా ముగిసిన కెసిఆర్ ఢిల్లీ పర్యటన..

- Advertisement -
- Advertisement -

CM KCR Returns to Hyderabad From Delhi

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటన విజవయంతంగా ముగిసింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి హెదరాబాద్‌కు చేరుకున్నారు. మూడు రోజుల సిఎం ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. శనివారం ప్రధాని మోడీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో భేటీ అయ్యారు. అంతకు ముందు రోజు కేంద్ర హోంశాఖ అమిత్‌షా, జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తదితరులను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు విభజన హామీలపై చర్చించారు. అలాగే రాష్ట్రంలో 6 దేశీయ విమానాశ్రయాల ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న నిధులు మంజూరు చేసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, వరదల సాయంతో కూడా చర్చించారు. సిఎం కెసిఆర్ చేసిన విజ్ఞప్తులపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది.

CM KCR Returns to Hyderabad From Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News