Friday, April 26, 2024

ఎమ్మెల్యే గణేష్ గుప్తాను పరామర్శించిన సిఎం

- Advertisement -
- Advertisement -

CM KCR To Visit Nizamabad To Meet MLA Ganesh Gupta

నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త తండ్రి బిగాల క్రిష్ణమూర్తి ద్వాదశ దినకర్మలో పాల్గొని ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో బిగాల కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను పరమార్శించారు. అనంతరం విందు చేసి తిరుగు ప్రయాణం చేశారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, గంప గోవర్ధన్, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, కామారెడ్డి జెడ్పి చైర్‌పర్సన్ దఫేదార్ శోభరాజు, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, రాజేశ్వర్, ఎంపి కె.ఆర్.సురేష్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి నివాళులర్పించి ఎమ్మెల్యే గణేష్ గుప్తాను పరమార్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బి.అశోక్ కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పట్నం సాయిలు, సొసైటీ మాజీ చైర్మన్ ఎం.రమణారావు, మాజీ సర్పంచ్ రాజేందర్, స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

CM KCR To Visit Nizamabad To Meet MLA Ganesh Gupta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News