Saturday, April 27, 2024

‘మహా’ఆశీర్వాదం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : గురు గోవింద్ సింగ్ మహాభినిష్క్రమణంతో నిర్మితమైన సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం గురుద్వారాను సిఎం కెసిఆర్ సందర్శించారు. సభాస్థలికి చేరుకున్న కెసిఆర్ నాందేడ్ సభా వేదికపై మరాఠా యోధులు చత్రపతి శివాజీ మహారాజ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేద్కర్, మహా త్మా జ్యోతి బాఫూలే, మహాత్మా బసవేశ్వర్ మహారా జ్, అన్నభావ్ సాఠే, అహిల్యబాయి హోవల్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.

n ఆద్యంతం ఉత్కంఠగా సాగిన కెసిఆర్ ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. చప్పట్లతో, నినాదాలతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
n తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి తమకు కావాలనే ఆకాంక్ష వారి హర్షాతిరేకాల్లో వ్యక్తమైంది
n దేశానికి నేతంటే కెసిఆర్‌యేనన్న నినాదాలు మారుమోగాయి.
n హైదరాబాద్ సంస్థానంతో నాందేడ్ ప్రజలకున్న అనుబంధం మరోసారి గుర్తు చేసింది
n తెలంగాణ బయట మొట్టమొదటిసారి జరిగిన బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ స్థాయి సమావేశం విజయవంతమైంది
n భారతదేశ పురోగతికి అవుటాఫ్ ది బాక్స్ వచ్చి ఆలోచనలు చేయాలని చెబుతూ…… మీడియాకు రీ ఇన్వెంట్ – రీ ఓరియంట్ ఇండియా, వరల్డ్ బిగ్గెస్ట్ డామ్స్, కోల్ రిజరవ్స్ ఇన్ ఇండియా, ఆల్ ఇండియా ఇన్ స్టాల్ కెపాసిటి తదితర డాక్యుమెంట్లను అందించారు.

మహారాష్ట్రలోని నాందేడ్ పర్యటన కోసం కెసిఆర్ ప్రగతి భవన్ నుంచి మధ్యాహ్నం 1.15 గంటకు బయలుదేరారు. బేగంపేటలోని విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు బయలుదేరారు. మధ్యాహ్నం రెండు గంటలకు నాందేడ్‌లోని గురుగోబింద్ సింగ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో బిఆర్‌ఎస్ నాందేడ్,తెలంగాణ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నాందేడ్ చారిత్రక గురుద్వారాను చేరుకున్నారు. సిక్కు మత గురువులు సాంప్రదాయ పద్ధతిలో కెసిఆర్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురుద్వారాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం గురుద్వారా నుంచి బిఆర్‌ఎస్ చేరికల సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతల బిఆర్‌ఎస్‌లో చేరారు.

అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. సమావేశం ముగిసిన తర్వాత స్థానిక సిటీ ప్రైడ్ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ భోజనానంతరం జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం నాందేడ్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరిగి రాత్రి 8.15 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, బిబి పాటిల్, ఎంఎల్‌సి కవిత, విప్ బాల్క సుమన్, ఎంఎల్‌ఎలు షకీల్ అహ్మద్, జోగు రామన్న, జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, మైనంపల్లి హన్మంతరావు, విఠల్ రెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్లు రవీందర్ సింగ్, మారం గంగారెడ్డి, రాజీవ్ సాగర్, వెంకటేశ్వర్ రెడ్డి, బిఆర్‌ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్, ఎపి బిఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News