Saturday, April 27, 2024

నేడు యాదాద్రికి సిఎం

- Advertisement -
- Advertisement -

CM KCR will visit Yadadri temple today

వచ్చే నెల 3, 4 వారాల్లో ఆలయ పునఃసంప్రోక్షణ

అపూర్వ స్థాయిలో ప్రారంభ వేడుకలు

ఏర్పాట్ల పరిశీలన, సుదర్శన యాగం కోసం యాగశాల నిర్మాణంపై దిశానిర్దేశం
యాగంలో 1108 యజ్ఞ కుండాలు… పాల్గొననున్న 6వేలపైచిలుకు రుత్విక్కులు
చివరిదశలో ప్రధాన ఆలయ ముఖద్వారం, ధ్వజస్తంభం, బలిపీఠం బంగారు తాపడం పనులు
టిటిడి ఆధ్వర్యంలో త్వరలో ఆలయ ప్రధాన గోపురం బంగారు తాపడం పనులు

మన తెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సోమవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సందర్శించనున్నారు. నేడు ఉదయం 11 గంటలకు ఆయన రోడ్డు మార్గం ద్వారా యాదాద్రికి చేరుకోనున్నారు. ముగింపు దశలో ఉన్న ఆలయ పునర్నిర్మాణ పనులను సిఎం పరిశీలించనున్నారు. ప్రధానంగా ఆలయ పున: సంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. మార్చి 22 నుంచి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు అంతర్జాతీయస్థాయిలో ఘనంగా జరిగే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పున: సంప్రోక్షణ జరపాలని ఇదివరకే సిఎం కెసిఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశ విదేశాల నుంచి యాదాద్రి పున: ప్రారంభ వేడుకలకు వచ్చే అతిథులు, పీఠాధిపతులు, యోగులు, స్వామీజీలు, కోట్లాదిగా తరలివచ్చే జనం కోసం కల్పించే సౌకర్యాలపై ఆయన దృష్టిసారిస్తారు. కాగా రాష్ట్ర ధార్మిక రాజధానిగా అవతరించబోతున్న యాదాద్రి పునర్నిర్మాణ పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. ఆలయ పున: సంప్రోక్షణ తేదీ దగ్గరపడుతుండటంతో అక్కడ యాగశాల నిర్మాణం, ఇతర పనులు, ఏర్పాట్లను ఆయన స్వయంగా సమీక్షించనున్నారు.

గతంలో ప్రకటించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన గోపురానికి బంగారు తాపడం పనులు త్వరలోనే మొదలుకానున్నాయి. దీనికోసం మొత్తంగా 120 కిలోల బంగారం అవసరమవుతుడంగా…ఇందులో 30కిలోల బంగారానికి సరిపడ నగదు సమకూరింది. మరో40 కిలోల బంగారం వివిధ వర్గాల నుంచి అందింది. ఇలా వచ్చిన మొత్తం 70 కిలోల బంగారం పోను మరో 50 కిలోల బంగారాన్ని సేకరించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రధాన ఆలయ ముఖద్వారం, ధ్వజస్థంభం, బలిపీఠాలకు బంగారు తాపడం పనులు చివరిదశలో ఉన్నాయి. ఇందుకోసం దాదాపు 13 కిలోల బంగారం పట్టింది. చెన్నై స్మార్ట్ క్రియేషన్ సంస్థ ఈ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పనులను కూడా సిఎం కెసిఆర్ కూలంకషంగా సమీక్షించనున్నారు.

కాగా సిఎం కెసిఆర్ దార్శనికతలో ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించిన యాదాద్రి పుణ్యక్షేత్ర పున: సంప్రోక్షణ కార్యక్రమాలను నభూతో, నభవిష్యతి అన్నచందంగా వారం రోజుల పాటు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మార్చి 22వ తేదీన సుదర్శన యాగంతో ప్రారంభమై 28 వ తేదీ అర్ధరాత్రి పున: ప్రారంభ కార్యక్రమాలు ముగియనున్నాయి. సుదర్శన యాగంలో 1108 యజ్ఞగుండాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో యజ్ఞగుండానికి కనీసం 6 గురి చొప్పున దాదాపు 6 వేల పైచిలుకు రుత్విక్కులు పాల్గొంటారు. కాగా 22వ తేదీన బాలాలయాన్ని మూసివేసి మూలవిరాట్టును యగశాలకు తరలిస్తారు. అప్పటి నుంచి పున: ప్రతిష్ట జరిగే వరకు సందర్శకులు స్వామివారిని యగశాలలోనే దర్శించుకోవాల్సి ఉంటుంది. తిరిగి 28వ తేదీ అర్ధరాత్రి కొత్త ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. మార్చి 29 వ తేదీ తెల్లవారు జాము నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కోసం భక్తులు, యాత్రికులు, సందర్శకులను అనుమతిస్తారు.

దేశ, విదేశాల నుంచి రానున్న అతిథులు

అంతర్జాతీయస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా సాగే పున: ప్రారంభ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి అతిథులు హాజరుకానున్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సిఎం కెసిఆర్ ఇది వరకే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా యాదాద్రి పుణ్యక్షేత్రం పున: సంప్రోక్షణ కార్యక్రమానికి ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా ప్రముఖులను, ముఖ్యులను స్వయంగా తానే కలిసి యాదాద్రి పున: ప్రారంభ వేడుకలకు ఆహ్వానిస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మతాధిపతులు, పీఠాధిపతులు, యోగులు, స్వామీజీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మార్చి నెలలో వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి కోట్లాదిగా జనం తరలివస్తారని ప్రభుత్వ అంచనా వేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News