- Advertisement -
ఉత్తరప్రదేశ్ : అనామిక శుక్లా అనే ఉపాధ్యాయురాలు ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్నట్లు మోసగించి కోటి రూపాయలకుపైగా వేతనం పొందుతున్న విషయం ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం తన నివాసంలో సీనియర్ అధికారులతో ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల తనిఖీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సిఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశించారు. ఈ ఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్ల ఒరిజినల్ సర్టిఫికెట్ల తనిఖీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వారికి సూచించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
- Advertisement -