Friday, April 26, 2024

జెఇఇ మెయిన్స్‌కి కరోనా నిబంధనలు

- Advertisement -
- Advertisement -

Corona Instructions for JEE Main 2020 Exam

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్‌ఐటిల్లో బి.టెక్, ఇంటిగ్రేటెడ్ బి.టెక్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) మెయిన్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) పలు జాగ్రత్తలు చేపడుతోంది. కోవిడ్-19 నేపథ్యంలో వాయిదా పడిన రెండవ విడత జెఇఇమెయిన్ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి నిర్ణీత నిబంధనలు పాటించడాన్ని తప్పనిసరి చేస్తూ ఎన్‌టిఎ ఆదేశాలిచ్చింది.

ప్రతి అభ్యర్థికి జారీచేసిన హాల్‌టికెట్(అడ్మిట్ కార్డు)తో పాటు, పరీక్షల సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై సూచనలు అందించింది. పరీక్ష కేంద్రాల వద్ద పాటించాల్సిన నిబంధనలు అడ్మిట్ కార్డులో పొందుపరిచారు. పరీక్ష హాలు లోపలికి పంపే ముందు విద్యారులకు శానిటైజర్ వేయడం, థర్మల్ స్క్రీనింగ్, ఐడీ కార్డు, అడ్మిట్ కార్డు తనిఖీ తదితర ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉండటంతో విడతల వారీగా విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి పంపించనున్నారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షలకు 8,58,273 మంది హాజరుకానుండగా, తెలంగాణ,ఎపి రాష్ట్రాల నుంచి 1.40 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి

విద్యార్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యంగా వస్తే అనుమతించరు. గుంపులుగా కాకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలి. ఎన్‌టిఎ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన అడ్మిట్‌కార్డులోని కోవిడ్-19 సెల్ఫ్ డిక్లరేషన్ (అండర్‌టేకింగ్)లో విద్యార్థుల ఆరోగ్య వివరాలు నమోదు చేయాలి. దానిపై ఫొటో అంటించి సంతకంతో పాటు ఎడమ చేతి బొటన వేలిముద్ర కూడా వేయాలి. అడ్మిట్‌కార్డులోని బార్‌కోడ్ రీడర్‌లను ప్రవేశద్వారాల వద్ద ఉంచుతారు, రీడ్ చేసిన వెంటనే అభ్యర్థుల ల్యాబ్ నెంబర్‌ను తెలియచేస్తుంది. విద్యార్థులకు పరీక్ష కేంద్రం వద్ద మాస్క్ ఇస్తారు. అప్పటి వరకూ ధరించిన మాస్క్‌ను తీసేసి కొత్త మాస్క్ ధరించాలి. శారీరక ఉష్ణోగ్రతలను థర్మోగన్స్ ద్వారా పరీక్షించాక లోపలికి అనుమతిస్తారు. శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్న విద్యార్థులకు ప్రత్యేక గది కేటాయించనున్నారు.

పరీక్ష పూర్తయ్యాక ఇన్విజిలేటర్ చెప్పే వరకూ సీటు నుంచి లేవరాదు. అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలి. బీఆర్క్ అభ్యర్థులు డ్రాయింగ్ టెస్ట్ కోసం జామెంట్రీ బాక్స్ సెట్, పెన్సిల్స్, ఎరేజర్స్, కలర్ పెన్సిల్స్ లేదా క్రేయాన్స్ తెచ్చుకోవాలి. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్, ఇతర నిషేధిత వస్తువులతో సహా వ్యక్తిగత వస్తువులను అనుమతించరు. అటెండెన్స్ షీటులో అతికించేందుకు అదనపు పాస్‌పోర్టు ఫొటో తీసుకురావాలి. ప్రతి షిఫ్ట్ ప్రారంభమయ్యే ముందు సీటింగ్ ఏరియా కీబోర్డ్, మౌస్, వెబ్‌క్యామ్, డెస్క్, కుర్చీ, మానిటర్ని పూర్తిగా శుభ్రపరుస్తారు. ఇందుకోసం అభ్యర్థులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. రఫ్ వర్క్ కోసం ప్రతి సీటు వద్ద తెల్లకాగితాలు ఐదు అందుబాటులో ఉంటాయి. కావాల్సి వస్తే అదనంగా ఇస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News