Saturday, April 27, 2024

కరోనా పాజిటివ్… నడిరోడ్డుపై మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Corona patient commit suicide

హసన్‌పర్తి: కరోనా పాజిటివ్ రావడంతో ఓ మహిళ పురుగల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని హసన్‌పర్తి ప్రాంతంలో జరిగింది. ఓ మహిళకు(50) తీవ్రమైన ఒళ్లు నొప్పులు, జ్వరం రావడంతో స్థానిక ప్రాథమిక కేంద్రంలో కరోనా టెస్టు చేయించుకుంది. కరోనా పరీక్షలలో పాజిటివ్ రావడంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటానని వైద్యులకు తెలిపింది. హసన్ పర్తిలో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడికి చేరుకొని మహిళను వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలోనే మహిళ మృత్యువాతపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News