Sunday, April 28, 2024

టిఆర్ఎస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతి మరియు పల్లె ప్రగతి కార్యక్రమాలు, పేద ప్రజలకు అందిస్తున్న పలు సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులైన పలువురు ప్రజాప్రతినిధులు  కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం మధ్యాహ్నం మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ 3,20,21,25 డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు రోజా శ్రీనివాస్, కుత్తడి సాయి, ప్రమీల శ్రీనివాస్, నవీన్, తూముకుంట మున్సిపాలిటీ 1,4 వ వార్డ్ కౌన్సిలర్లు భరత్ సింగ్, మధుసూదన్ రెడ్డి, ఘటకేసర్ మునిసిపాలిటీ నుండి 5వ వార్డు కౌన్సిలర్ అనురాధ రాఘవరెడ్డి, షామీర్ పేట మండలంలోని ముగ్గురు ఎం.పి.టి.సిలు ఇందిరా, మౌనిక శివ ప్రసాద్, అశోక్ లు ఈ రోజు తెలంగాణ భవన్ లో మంత్రి, టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శ్రీ బాల్క సుమన్, ఎంఎల్ఎ కె పి వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంఛార్జ్ చామకుర మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News