Monday, April 29, 2024

టీమిండియా విజయంలో కీలక పాత్ర.. ధ్రువ్ జురెల్ పై ప్రశంసల వర్షం

- Advertisement -
- Advertisement -

టీమిండియా వికెట్ కీపర్ ధ్రవ్ జురెల్ పై క్రికెట్ ప్రముఖులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాలుగో టెస్టులో టీమిండియాకు విజయం వరించిందంటే.. అది కేవలం ధ్రువ్ వల్లే జరిగిందంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన నాలుగో టెస్టులో.. తొలి ఇన్నింగ్స్ 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడిన భారత్ ను తన అద్భుత ఆటతో ఆదుకున్నాడు ధ్రువ్.

క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన అతను.. ఇంగ్లాండ్ బౌలర్లు ధీటుగా ఎదుర్కొంటూ 90 పరుగులు చేశాడు. దీంతో భారత్ పటిష్ట స్థితిలో నిలించింది. అనంతరం ఇంగ్లాండ్ నిర్ధేశించిన 192 పరుగుల లక్ష్య చేధనలోనూ ధ్రువ్ కీలకమైన 39 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ధ్రువ్ జురేల్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.అరంగేట్రం మ్యాచ్ లోనే ఎంతో అనుభవమున్న ఆటగాడిగా జట్టును ఆదుకున్న ధ్రువ్ మాజీ క్రికెటర్లలతోపాటు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News