Saturday, April 27, 2024

క్షుద్ర పూజలు, చేతబడి నేపథ్యంలో…

- Advertisement -
- Advertisement -

దగ్గుబాటి రానా కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రానా.. లేటెస్టుగా మరో త్రిభాషా చిత్రాన్ని ప్రకటించాడు. హార్రర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మిలింద్ రౌ దర్శకత్వం వహించనున్నాడు. మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మిలింద్.. సిద్దార్థ్ హీరోగా వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘గృహం’తో సూపర్ హిట్ అందుకున్నాడు. అలానే నయనతార ప్రధాన పాత్రలో ‘నెట్రికన్’ అనే మిస్టరీ థ్రిల్లర్‌ని డైరెక్ట్ చేశాడు. ఈ క్రమంలో రానాతో ఓ వైవిధ్యమైన సినిమా చేయడానికి స్టోరీ సిద్ధం చేసుకున్నాడు.

కాగా రానా, మిలింద్ కాంబోలో రాబోతున్న సినిమా క్షుద్ర పూజలు, చేతబడి నేపథ్యంలో ఉండబోతోందని సమాచారం. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషలో రూపొందనున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్‌పై ఆచంట గోపీనాథ్ నిర్మించనున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు నుంచే ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా కుదరలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూట్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుందని తెలిసింది. ఇదిలా ఉండగా రానా నటించిన త్రిభాషా చిత్రం ‘అరణ్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. నేషనల్ అవార్డు గ్రహీత ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే వేణు ఉడుగుల దర్శకత్వంలో ‘విరాట పర్వం’ అనే సోషల్ డ్రామాలో రానా నటిస్తున్నాడు. అంతేకాకుండా గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశ్యప’ అనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌కి కూడా రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News