Wednesday, May 1, 2024

‘దళితబంధు’ ఫలితం

- Advertisement -
- Advertisement -

 దళిత వర్గాలకు ఇది
మేల్కొలుపు వంటిది
సిఎం కెసిఆర్ విజన్‌కు
ధన్యవాదాలు అట్టడుగు
వర్గాలను అభ్యున్నతి వైపు
తీసుకెళ్లడమే మా ప్రభుత్వ
లక్షం : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : దళిత వర్గాల జీవితాలను దళితబంధు పథకం పెద్దఎత్తున మార్పు తీసుకొస్తోందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఇది దళిత వర్గాలకు మేలుకొలుపు వంటిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే దళిత బంధు కార్యక్రమం అమలు జరుగుతోందన్నారు. బ్యాంకుల నిబంధనలు, తీసుకున్న రుణాలకు తిరిగి కిస్తీలు కట్టే బాధ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల చొప్పున ఉచితంగా సాయం అందిస్తోందన్నారు. ఇంత అద్భుతమైన పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ మేరకు దళితబంధుపై ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన ఒక కథనంపై కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

దళితబంధు ద్వారా వారి జీవితాల్లో తీసుకొచ్చిన మార్పుపై ఆ కథనంలో చక్కగా విశ్లేషించారని ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న దళితబంధు సత్ఫలితాలను ఇవ్వడం మొదలు పెట్టిందన్నారు. దీనిపై మనస్పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కెసిఆర్ విజన్‌కు ప్రత్యేకంగా ధన్యాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. సామాజిక, ఆర్థిక వ్యవస్థలో అట్టడుగున ఉన్న నిరుపేదలను అభ్యున్నతి వైపు తీసుకెళ్లడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా కెటిఆర్ ఉద్ఘాటించారు.

మీ స్పూర్తిగా అలాగే కొనసాగించండి!
బాలీవుడ్ నటుడు సోనూసూద్ పుట్టిన రోజు సందర్భంగా కెటిఆర్ ట్వీట్ చేశారు. సోనూసూద్ భాయ్ మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు మానవత్వంతో మీ పనిని ఇలాగే కొనసాగించండి అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మీ సేవా స్ఫూర్తిని కూడా అలాగే కొనసాగించండి అని కెటిఆర్ పేర్కొన్నారు. మీకు మరింత శక్తి రావాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో మీకు మీరే సాటి అని ఈ సందర్భంగా కెటిఆర్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News