Monday, May 6, 2024

25న 11 రాష్ట్రాలకు రూ.19వేల కోట్ల రుణ సమీకరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రిజర్వ్‌బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో పదకొండు రాష్ట్రాలకు కేంద్రం అనుమతించడంతో.. రూ. 19 వేల కోట్లను రుణంగా సమీకరించుకోనున్నాయి. ఈ నెల 25వ తేదీన (మంగళవారం) రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఈ- కుబేర్) విధానంలో ఈ వేలం నిర్వహించనున్నారు. ఇందు కోసం ఏడేళ్ల నుంచి 18 ఏళ్ల కాలానికి ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేశాయి. ఈ సారి నిర్వహించే ఆర్‌బిఐ వేలంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అనుమతించ లేదు. వేలంలో పాల్గొనే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, బిహార్, గోవా, కేరళ, మణిపూర్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనున్నాయి. ఈ వేలం అనంతరం ఆయా రాష్ట్రాల ఖజానాకు ఆ మొత్తం సమకూరుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News