Saturday, April 27, 2024

టిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం

- Advertisement -
- Advertisement -

Development and welfare with the TRS government

మన తెలంగాణ/మోత్కూరు: టిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని మోత్కూరు మార్కెట్ చైర్మన్ కొణతం యాకూబ్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించడం పట్ల టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకుని స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తున్నారన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టిఆర్‌ఎస్ అభ్యర్థులను ఏకపక్షంగా భారీ మెజార్టీతో గెలిపించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పొన్నెబోయిన రమేష్, బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, గిరగాని శ్రీను, గజ్జి మల్లేష్, రైతుబంధు మండల అధ్యక్షుడు కొండా సోంమల్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ బి.వెంకటయ్య, మాజీ ఎంపిటిసి జంగ శ్రీను, గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్సగిరి, నాయకులు బయ్యని పిచ్చయ్య, పి.స్వామిరాయుడు, కె.రాజు, ఎం.నగేష్, మునీర్, రాజేష్, ప్రవీణ్, ఎం.శ్రీను, కె.ఇంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News