Wednesday, May 1, 2024

పలు రైళ్ల దారి మళ్లింపు

- Advertisement -
- Advertisement -

Diversion of several trains due to heavy rains

హైదరాబాద్: అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో దక్షిణమధ్య రైల్వే పలు రైళ్లను దారి మళ్లీస్తోంది. నందలూరు టు-రాజంపేట మధ్య వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా కొన్ని ప్రాంతాల్లో రైలు పట్టాలకు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లీంచినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం తిరుపతి నుంచి వెళ్లేందుకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు పాకాల జంక్షన్‌లో రైలు ఎక్కాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. దీంతోపాటు పలు ప్రాంతాల మీదుగా ప్రయాణించే రైళ్లను కూడా దారి మళ్లీంచినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News