Monday, April 29, 2024

ఎమ్మెల్సీగా మధుసూదనాచారి నియామకం

- Advertisement -
- Advertisement -
Madhusudhana Chary as MLC under governor quota
ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి

హైదరాబాద్ : గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. సర్క్యులేషన్ పద్దతిలో ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం.. మధుసూదనాచారి పేరును సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కొద్దిరోజుల క్రితం కౌశిక్‌రెడ్డి పేరును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇటీవలే ఆయనను శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించడంతో తొలుత చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలోనే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి మధుసూదనచారి పేరును తాజాగా సూచిస్తూ ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఆయన నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News