Friday, April 26, 2024

ఏపి వరద బాధితుల కోసం విరాళాలు

- Advertisement -
- Advertisement -

Donations for AP flood victims
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ఇటీవల వరదలు ముంచెత్తడంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సాయంగా సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. వరద బాధితుల సాయంగా మెగాస్టార్ చిరంజీవి తనవంతుగా రూ.25 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. -ఇక చిరంజీవి బాటలోనే ఆయన తనయుడు రామ్‌చరణ్ కూడా బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా రూ. 25 లక్షల రూపాయలను ఏపీ సిఎం రిలీఫ్ ఫండ్‌కి అందజేశారు. -సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వరదబాధితుల కోసం రూ.25 లక్షల సాయం ప్రకటించారు. అదేవిధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ. 25 లక్షలు, నిర్మాత అల్లు అరవింద్ 10 లక్షలు ముఖ్యమంత్రి సహా య నిధికి విరాళంగా అందజేయడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News