Wednesday, May 1, 2024

సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao became a member of the key GoM

సిద్దిపేట: రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతామని మంత్రి హరీష్ రావు తెలిపారు. గజ్వెల్ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల దరఖాస్తుల స్వీకరణను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు లబ్దిదారులను ఎంపిక చేశారు. నిర్మాణం పూర్తయిన 1250 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తుల స్వీకరించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని, యాసంగిలో ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని ప్రశంసించారు. గజ్వెల్‌లో 60 వేల ఎకరాల్లో పంటలను కాళేశ్వరం నీళ్లతో కాపాడుకున్నామన్నారు. కొడకండ్లలో రేషన్ కార్డు లేని పేదలకు 15 రోజుల్లో రేషన్ కార్డులు అందజేస్తామని, కొడకండ్లకు మరో 50 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కొత్తగా మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్‌పి చైర్మన్ రాధాకృష్ణ శర్మ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News