Monday, April 29, 2024

డిఆర్‌డిఎ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సంజీవ్ కుమార్ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా కలకం రేపింది. ఇటీవలే పదోన్నతి పొందిన ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మారుతీనగర్‌లో ఆయన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారని పోలీసులు తెలిపారు. కలెక్టరేట్‌లో ఉండే తన కార్యాలయంలో ఉదయం వచ్చి విధులు నిర్వహించి, ఆరోగ్యం స్థిమితంగా లేదని ఇంటికి వెళ్లారు. అయితే, చాలా సేపటికి వరకు కూడా తిరిగి రాకపోవడంతో ఆయన కారు డ్రైవర్ మారుతీనగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లి చూడగా, ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది. సంజీవ్ కుమార్ సుదీర్ఘకాలంగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఎంపిడిఒగా పనిచేశారు. సమర్థుడైన అధికారిగా ముద్ర ఉందని పలువురు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News