బిజ్నోర్: ఓ మందుబాబు శ్మశాన వాటికలో ఉన్న మృతదేహాల నుంచి చేతులు, కాళ్లు తీసుకొచ్చి ఇంట్లో వండుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బిజ్నోర్లో జరిగింది. భర్త వండిన కూరలో మనిషి చేతుల వేళ్లు కనిపించడంతో పోలీసులు సమాచారం ఇవ్వడంతో అతడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… టిక్కోపూర్ అనే గ్రామంలో సంజయ్ అనే వ్యక్తి మద్య సేవిస్తూ జులాయిగా తిరిగేవాడు. అతడికి భార్య, పిల్లలు ఉన్నారు. భార్య మార్కెట్కు వెళ్లినప్పుడు భర్త శ్మశాన వాటిక వెళ్లి మృతదేహాల నుంచి కాళ్లు, చేతులు తీసుకొచ్చాడు. భార్య వచ్చేసరికి కూర వండి వంటింట్లో పెట్టాడు. డిన్నర్కు నాన్ వెజ్ కర్రీ చేశానని తినమని భార్యకు చెప్పాడు. ఆమె ప్లేటులో అన్నం పెట్టుకున్న తరువాత కూరను వండించుకుంది. అన్నంలో ముక్కను కలిపిన తరువాత క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే మనిషి వేళులాగా కనిపించింది. వెంటనే షాక్ కు గురైన భార్య అతడిని ఇంట్లో పెట్టి డోర్ లాక్ చేసి స్థానికులకు సమాచారం ఇచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మందుబాబును అదుపులోకి తీసుకున్నారు. గంగా నది ఒడ్డున దహనమవుతున్న మృతదేహాల నుంచి కాళ్లు, చేతులను తీసుకొచ్చి మందుబాబు వండుకునేవాడని పోలీస్ అధికారి ఆర్సి శర్మ తెలిపాడు. భోజనంలో ఉన్న మనిషి మాంసపు ముక్కను గుర్తించి ఆయన భార్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చిందని శర్మ పేర్కొన్నారు. అతడింట్లో ఉన్న మనిషి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నామని, మందుబాబును అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు పేర్కొన్నారు.
Drunker cooks parts of human hand for dinner in UP,Sanjay, was locked in his home in Bijnor’s Tikkopur village in Biznore