Saturday, May 4, 2024

మద్యం మత్తులో గొంతు కోసుకున్న మందుబాబు

- Advertisement -
- Advertisement -

blade

 

హైదరాబాద్: మందుబాబు మద్యం మత్తులో గొంతుకోశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సాయికుమార్ (33) అనే వ్యక్తి క్యాటరింగ్ పనులు చేస్తూ జీవించేవాడు. హైదరాబాద్ లోని సీతారాంబాగ్‌లోని కృపాకాంప్లెక్స్ మద్య మత్తులో టీ దుకాణానికి వచ్చాడు. అటు ఇటు తూలుతూ టీ కావాలని అడిగాడు… ఎవరు పట్టించుకోకపోవడంతో ప్యాంటు జేబులో నుంచి బ్లేడు తీసుకొని గొంతు కోసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించామని సిఐ నర్సింహ స్వామి తెలిపారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

 

Drunker cut throat with blade in Hyderabad
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News