- Advertisement -
హైదరాబాద్: విజయవాడ ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు రావడంతో రైలును కాసేపు ఆపేశారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో బాంబు పెట్టామని గురువారం ఉదయం 5.30 నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తమై రైలును నిలిపివేసి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. సి1, సి3 ఎసి బోగీలు, లగేజీ బోగీలను పరిశీలించారు. బాంబు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ కాల్ చేసి ఉంటారని రైల్వే పోలీసులు తెలిపారు.
Bomb threat Inter City Express in Vijawada to hyd
- Advertisement -