- Advertisement -
బబనే: ఆఫ్రికాలోని ఎశ్వాతిని దేశ ప్రధాని ఆంబ్రోస్ మాండ్వలో లామిని కరోనా వైరస్తో కన్నుమూశారు. నవంబర్ రెండో వారంలో కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. లామిని పరిస్థితి విషమంగా మారడంతో డిసెంబర్ 1న దక్షిణాఫ్రికాలో ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసియులో చికిత్స పొందుతూ ఆదివారం అర్థ్రరాతి తుదిశ్వాస విడిచారు. 2018 నవంబర్లో ఎశ్వాతిని దేశంలో జరిగిన ఎన్నికలలో గెలవడంతో ప్రధానిగా లామిని ఉన్నారు. 18 సంవత్సరాలు బ్యాంకింగ్ రంగంలో పని చేశారు. ఎశ్వాతిని దేశా జనాభా 12 లక్షలుకాగా 6768 మందికి కరోనా సోకగా 127 మంది చనిపోయారు.
- Advertisement -