Sunday, April 28, 2024

‘రాజ్యాంగ రక్షణకు అందరూ ఐక్యం కావాలి’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లోని బిజెపి 10 ఏళ్ల పాలనలో దళితులు పేదల హక్కులు కాలరాయటమే కాకుండా దేశ ప్రజలందరి గుండెకాయగా ఉన్న భారత రాజ్యాంగ రద్దుకు ప్రయత్నిస్తున్నదని, మధ్యయుగ కాలంనాటి మనుస్మృతిని తిరిగి ప్రవేశపెట్ట చూస్తుందని రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి రాజకీయాలకతీతంగా ఐక్యం కావాలని ఆలిండియా దళిత్ రైట్ మూమెంట్ (ఎఐడిఆర్‌ఎం) ప్రధాన కార్యదర్శి నిర్మల్ పిలుపునిచ్చారు.

బిజెపి పాలనలో దళితులకు ఏ మాత్రం రక్షణ లేదని దాడులు దౌర్జన్యాలు మునుపెన్నడు లేని విధంగా 300 రేట్లు పెరిగాయని దళితుల సమస్యలపై జాతీయ స్థాయి ఉద్యమానికి సన్నద్ధం కావాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ పిలుపు నిచ్చారు. సోమవారం హిమాయత్‌నగర్‌లోని మగ్దుంభవన్‌లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్‌పిఎస్) తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (జవహర్ నగర్) తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (అమృత ఎస్టేట్) సంఘాల సంయుక్త సమావేశం బికెఎంయూ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి బాల మల్లేష్ అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మల్, బి వెంకట్ లు మాట్లాడుతూ బిజెపి అధికారంలో వచ్చినప్పటి నుండి రాజ్యాంగ హక్కులు రద్దు కాబడుతున్నాయని రాజ్యాంగంలో ఒక్కొక్క పేజీని ప్రభుత్వం చింపుతోందని, దేశ ప్రజలందరికీ దిశా నిర్దేశం చేయగలిగిన రాజ్యాంగాన్ని రద్దుచేసి మనుస్మృతి ని ప్రవేశపెట్టి మత రాజ్యాన్ని స్థాపించచూస్తుందని దీనిని నేటి తరం అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు.

ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా నడిరోడ్డులో అమ్ముతూ రిజర్వేషన్లు లేకుండా చేసి రాజ్యాంగంలో మూల స్తంభం లాంటి సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తుందన్నారు. వాముపక్షాలతో ఒత్తిడితో వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కూలీలలో అత్యధికలు దళితులే ఉన్నారని వారికి కేటాయించిన నిధులు క్రమేపి తగ్గిస్తూ ఆ చట్టాన్ని నిర్వీర్యం చూస్తుందని విమర్శించారు బిజెపి పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో ఆదివాసి గిరిజన బిడ్డపై బిజెపి ఎమ్మెల్యే సహాయకుడు నడిరోడ్డుపై మూత్రం పోయడం చూస్తే దేశం ప్రస్తుతం ఎటు పోతుందనే అనుమానం కలుగుతుందన్నారు ఈ పోకడలు చూస్తే మనువాదానికి మత ఘర్షణలకు పేదల మధ్యలో వైశామ్యాలకు ఉద్దేశపూర్వకంగానే బిజెపి కుటిల ప్రయత్నాలు చేస్తుందన్నారు.

ప్రజాస్వామిక దేశంలో పౌరులు ప్రశ్నించడాన్ని స్వాగతించాల్సింది పోయి అక్రమ కేసులు బనాయించటం సరికాదన్నారు. జాతీయ స్థాయిలో దళితుల హక్కుల కోసం ఒక కీలకమైన ఎజెండాను దళితుల ముందు ఉంచుతామని వారు చెప్పారు. సమావేశంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్)రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జాన్ వెస్లీ టీ స్కైలాబ్ బాబు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాంతయ్య తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, రాష్ట్ర నాయకులు ఆర్ అంజనేయులు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యేసు రత్నం కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం కృపాసాగర్ ఎన్ బాల పీరు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News