Friday, May 17, 2024

ప్రతి ఇంటికి వెళ్లి విద్యార్థుల నమోదు చేపట్టాలి: సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

గిరిజన గురుకుల, ఆశ్రమ పాఠశాలలు పున: ప్రారంభానికి సన్నద్దం

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతుల కల్పన

గిరిదర్శిని ద్వారా విద్యార్థుల నమోదు

విద్యార్థుల నమోదులో అంగన్వాడీ సిబ్బందితో సమన్వయం

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్ కమాండ్ సెంటర్

పాఠ్యపుస్తకాలన్నీ విద్యార్థులకు అందించాలి

తాత్కాలిక, అత్యవసర మరమ్మత్తుల కోసం ప్రధానోపాధ్యాయులకు 20వేల రూపాయలు విడుదల

గిరిజన గురుకుల, ఆశ్రమ పాఠశాలల పున: ప్రారంభంపై మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సమీక్ష

Every student join in schools

హైదరాబాద్: కోవిడ్ -19 అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రత్యక్ష పద్దతిలో పున: ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించిన నేపథ్యంలో గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను సన్నద్ధం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ  శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గిరిజన విద్యాసంస్థల పున: ప్రారంభంపై గిరిజన శాఖ అధికారులతో మంత్రి నేడు హైదరాబాద్, దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో సమీక్ష చేశారు.

కోవిడ్ వల్ల పాఠశాలలు మూత పడడంతో చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారన్నారు. విద్యా సంస్థలు పున: ప్రారంభం కావడంతో విద్యార్థులందరినీ చేర్పించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని చెప్పారు. గిరిదర్శిని కార్యక్రమంలో భాగంగా గిరిజన తండాలు, గూడాలలో ఉండే గిరిజనుల ప్రతి ఇంటికి వెళ్లి విద్యార్థుల నమోదు చేపట్టాలని సూచించారు. ఏ ఒక్కరు పాఠశాలలో చేరకుండా ఉండొద్దు అని చెప్పారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి సెప్టెంబర్ లో పాఠశాలలకు వచ్చే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. 15 రోజుల పాటు జరిగే గిరిదర్శిని కార్యక్రమంలో ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొని, విద్యార్థుల భవిష్యత్ కోసం అంకితభావంతో కృషి చేయాలని కోరారు. గ్రామాల్లో ఉన్న అంగన్ వాడీ ఉద్యోగుల సేవలను ఇందుకోసం వినియోగించుకోవాలని, గ్రామాల్లోని ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా అంగన్వాడీలతో సమన్వయం చేసుకోవాలన్నారు.

కోవిడ్ వల్ల మూతపడ్డ విద్యా సంస్థలలో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని సత్యవతి రాథోడ్ ఆదేశించారు. విద్యా సంస్థల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి కనీస వసతులు కల్పించి, కావల్సిన మరమ్మత్తులను వెంటనే చేపట్టాలన్నారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లకు 20వేల రూపాయల చొప్పున విడుదల చేయాలన్నారు. ఆహార పదార్థాలకు, కాస్మొటిక్స్ కొరత లేకుండా గిరిజన కో ఆపరేటివ్ కార్పోరేషన్(జీసీసీ) ద్వారా సమన్వయం చేసుకోవాలన్నారు.

విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, అత్యవసర సేవల కోసం 24 గంటల పాటు నడిచే విధంగా హెల్త్ కమాండ్ సెంటర్ ను నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులు, సిబ్బందికి కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. శానిటైజేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు కావల్సిన పాఠ్యపుస్తకాలన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, గిరిజన గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సర్వేశ్వర్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, విజయలక్ష్మీ, లక్ష్మీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News