Monday, May 6, 2024

కుటుంబాన్ని అంతం చేయబోయి… కూతురు చేతిలో హతమైన మాజీ సైనికుడు

- Advertisement -
- Advertisement -

 

లక్నో: మాజీ సైనిక ఉద్యోగి తన భార్య, కూతురిని గన్ తో కాల్చి అనంతరం కుమారుడిపై కాల్పులు జరుపుతుండగా కూతురు అతడి చేతిలో ఉన్న గన్ లాక్కొని కాల్పులు జరపడంతో జవాన్ చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని మధుర ప్రాంతం మితౌలిలో జరిగింది. ఈ ఘటనలో మాజీ సైనికుడు మృతి చెందగా అతడి భార్య, కూతురు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  చత్రం సింగ్ అనే జవాను జాట్ రెజిమెంట్ లో నాయక్ గా పని చేశాడు.  2014లో సైనికుడిగా పదవీ విరమణం పొందాడు. అప్పడే రెజిమెంట్ నుంచి ఒక గన్ తీసుకున్నాడు. చత్రం సింగ్ తన భార్య, కూతురుతో గొడవ పెట్టుకొని భార్యను తుపాకీతో కాల్చిన అనంతరం కూతురుపై  కాల్పులు జరిపాడు. చివరగా తన పదమూడేళ్ల కుమారుడిపై కాల్పులు జరుపుతుండగా అతడి పై కూతురు దూకి గన్ ను లాక్కుంది. అనంతరం గన్ తో తన తండ్రిని మూడు రౌండ్లు కాల్చింది. వెంటనే కుమారుడు కేకలు వేయడంతో స్థానికులు ఇంటికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చత్రం సింగ్ చికిత్స పొందుతూ చనిపోయాడు. అతడి భార్య, కూతురు మాత్రం ఐసియులో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చత్రం సింగ్ చనిపోయే ముందు ఇచ్చిన  సమాచారం మేరకు… అతడి కుమార్తె స్థానిక యువకుడితో ప్రేమలో పడడంతో పలుమార్లు ఆమెను తండ్రి హెచ్చరించాడని, కూతురు ప్రేమ వ్యవహారంతోనే కుటుంబంలో కలహాలు చెలరేగాయని… అది కాల్పుల వరకు దారితీసిందని మాథుర డిఐజి  షాలాబ్ తెలిపాడు. నౌఝీల్ పోలీస్ స్టేషన్ లో కాల్పుల ఘటనపై 307 (హత్యాయత్నం), 302(మర్డర్), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Ex-soldier opens fire at family, Daughter kills him 
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News