Monday, April 29, 2024

వారణాసి బాంబు పేలుళ్ల సూత్రధారికి ఉరిశిక్ష

- Advertisement -
- Advertisement -

Execution of mastermind of Varanasi bomb blasts

 

లఖ్‌నవూ : ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ సెషన్స్ కోర్టు 2006 నాటి వారణాసి బాంబు పేలుళ్ల సూత్రధారి , ఉగ్రవాది వలీఉల్లా ఖాన్‌కు ఉరిశిక్ష విధించింది. శనివారం జరిగిన విచారణలో 16 ఏళ్ల క్రితం జరిగిన వారణాసి బాంబు పేలుళ్లకు సంబంధించిన రెండు కేసుల్లో వలీఉల్లా ఖాన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ నేపథ్యం లోనే సోమవారం తీర్పును ఖరారు చేసింది. 2006 మార్చి 7 న వారణాసి లోని సంకట్ మోచన్ ఆలయం వద్ద మొదట బాంబు పేలుళ్లు సంభవించాయి. 15 నిమిషాల తరువాత కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో మరో బాంబు దాడి జరిగింది. ఈ రెండు ఘటనల్లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలకు సంబంధించి హత్య, హత్యాయత్నం, తీవ్రంగా గాయపరచడం, ఆయుధాలను అక్రమంగా వినియోగించడం, తదితర నేరారోపణలతో వలీఉల్లా ఖాన్‌పై పోలీసులు అభియోగాలను మోపారు. ఈమేరకు రెండు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో పోలీసులు సరైన సాక్షాధారాలు సమర్పించడంతో గజియాబాద్ కోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ సిన్హా, దోషికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News