- Advertisement -
హైదరాబాద్ : ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు గురువారంతో (అక్టోబర్ 15) ముగియాల్సి ఉండగా, దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. అక్టోబర్ 31వరకు ఎల్ఆర్ఎస్ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రతిక ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా చాలా మంది దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల కరెంట్ సరఫరాలో అంతరాయం, ఇంటర్నెట్ కనెక్టివిటీ అవాంతరాల నేపథ్యంతో క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సిఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 19.33 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
- Advertisement -