Wednesday, May 1, 2024

రైతుపై అహంభావ ప్రదర్శనా?

- Advertisement -
- Advertisement -

farmers protest against new farm laws

అన్నదాతల సమస్య పరిష్కరించాల్సిన సమయంలో ప్రభుత్వానికి అహమే అడ్డొస్తోందన్న విషయం జాతీయ స్థాయి మీడియాకు, బిజెపి శ్రేణుల్లో చాలా మందికి తెలుసు. విధానం కాదు, కార్పొరేట్ వర్గాలకు చేసిన వాగ్దానాల అమలు కాదు. రైతు వ్యతిరేక సాగు చట్టాల పవిత్రత కాదు. పాలకుడు అసలు తప్పు చేయడు అనే అహమే దీనికి కారణం. తప్పులు అంగీకరించి వాటి నుంచి బయటపడటం ఇక్కడ జరగదు. దేశంలోని ప్రతి ఒక్క రైతూ ప్రభుత్వం నుంచి వ్యవస్థ నుంచి వేరుపడిపోయినా సరే దేశాధినేతది తప్పు కానేకాదు. ఇదే నిజమని తెలుస్తున్నా జాతీయ స్థానిక మీడియా మాధ్యమాల్లో ఏ ఒక్కటీ కనీసం గుసగుసల రూపంలో కూడా దీన్ని వ్యక్తం చేయడం లేదు. మనమెందుకు రైతుల సమస్యల గురించి మాట్లాడకూడదు అనే ఒక్క ట్వీట్‌కు వచ్చిన అమిత స్పందన కూడా పాలకుల అహాన్ని కరిగించడం లేదు. లక్షలాది మంది ప్రజలకు విద్యుత్, నీరు అందకుండా చేయడం, తద్వారా వారిని తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడేయడం, పోలీసు, పారా మిలిటరీ బలగాలతో వారి చుట్టూ బ్యారికేడ్లు కట్టడం, ఎటూ పోనివ్వకుండా చేసి వారిని అత్యంత అనారోగ్య పరిస్థితుల్లోకి నెట్టడం, నిరసన తెలుపుతున్న రైతుల వద్దకు ఎవ్వరు వెళ్లడానికి అసాధ్యమయ్యేలా రోడ్లపై మేకులు పాతించడం, కాంక్రీట్, ఐరన్ బ్యారికేడ్లు నిర్మించడం. చలి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతలు పడిపోయి గత రెండు నెలలుగా రెండు వందల మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం, ఢిల్లీ శివార్లలో నెలకొంటున్న ఘోర పరిణామాలు మనకు కనబడుతున్నాయి.

ప్రపంచంలో మరెక్కడైనా ఇలాంటివి జరిగితే అనాగరికమైవిగానూ, మానవ హక్కులపై పెను దాడిగా కనిపించేవి. కానీ మన ప్రభు త్వం, కులీన పాలకవర్గం వీటికి మించిన సమస్యల్లో తలమునకలవుతున్నాయి. భూమ్మీద అతి గొప్ప దేశమైన భారత్‌ను అప్రతిష్ఠ పాలుచేయడానికి, అవమానించడానికి ప్రయత్నిస్తున్న రిహానా, గ్రెటా థన్‌బెర్గ్ అనే భయంకరమైన అంతర్జాతీయ ఉగ్రవాదుల కుట్రను వమ్ము చేయడం ఎలా అనే విచక్షణలో మనం కూరుకుపోతున్నాం. ప్రతి రోజూ ఢిల్లీ శివార్లలో ప్రజాస్వామ్యాన్ని చీల్చి పడేస్తున్న ఇలాంటి పరిణామాలును వ్యవస్థాను కూల వర్గాలు కూడా అమోదించలేదని మీరు భావించవచ్చు. తాము తీసుకొచ్చిన సాగు చట్టాలపై రైతులతో ఎలాంటి సంప్రదింపులూ జరపలేదనీ మన మంత్రులకు తెలుసు. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉన్నప్పటికీ ఈ చట్టాల రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులూ జరపలేదు. చివరకు ప్రతిపక్షాలతో కానీ, పార్లమెంటులో కానీ దీనిపై చర్చించడానికి పూనుకోలేదు. కేంద్ర ప్రభుత్వాధినేత ఏ విషయంలోనూ కేబినెట్‌తో చర్చించిన పాపాన పోలేదు ఇది వాస్తవం.

పంజాబ్‌లో దాదాపు ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒకరు రైతు నిరసనకారులుగా మారిపోయారనడంలో అతిశయోక్తి లేదు. కొందరు ఇప్పటికే వారిలో కలిసే ప్రక్రియలో ఉంటున్నా రు. జరుగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నిలపడానికి కూడా బిజెపి కొట్టుమిట్టాడుతోంది. ఈలోగా పంజాబ్‌లోని ఒకతరం యువత మొత్తంగా వేరుకుంపటి పెట్టింది భవిష్యత్తులో దీని ప్రభావాలు తీవ్రాతితీవ్రంగా ఉండబోతున్నాయన్నది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం సాధించిన అతి గొప్ప విజయం ఇదే మరి. సాంప్రదాయికంగా ప్రత్యర్థులుగా ఉండే రైతులు, కమిషన్ ఏజెంట్లతో సహా విభిన్న సామాజిక శక్తులను భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏకం చేసింది. పైగా కేంద్రం సిక్కులను, హిందువులను, ముస్లింలను, జాట్స్‌ని, జాట్లు కానివారిని మాత్రమే కాకుండా కాప్ పంచాయితీలను, ఖాన్ మార్కెట్లలో పని చేసే వారిని కూడా ఒకటిగా చేసేసింది. నిజంగానే ఇది ముచ్చట గొలిపే విషయం. అయితే ఇది పంజాబ్, హర్యానాకు మాత్రమే పరిమితమని కొన్ని ప్రశాంత స్వరాలు రెండు నెలలుగా చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నాయనడం లో అతిశయోక్తి లేదు.

ఇప్పుడు తమాషా కలిగించే విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టు గతంలో నియమించని ఒక కమిటీ పంజాబ్, హర్యానా భారత యూనియన్‌లో భాగమని చెప్పి ఉండటమే. కాబట్టి అక్కడేం జరిగినా అది మనందరినీ ప్రభావితం చేస్తుందని గ్రహించాలి. అయితే సంస్కరణలను ప్రతిఘటిస్తున్నది సంపన్న రైతులేనని కొందరు ఇప్పటికీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇక దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, గత ఎన్.ఎస్.ఎస్ సర్వే ప్రకారం పంజాబ్‌లో ఒక సగటు కుటుంబం ఆదాయం రూ. 18,059లు. ఒక్కో రైతు కుటుంబంలో కనీసం అయిదుగురు సభ్యులుంటారు. అంటే తలసరి నెలవారీ ఆదాయం రూ. 3,450 లు అన్నమాట. అంటే సంఘటిత రంగంలో అత్యంత తక్కువ వేతనం పొందే ఉద్యోగి కన్నా రైతుల తలసరి ఆదాయం తక్కువ అన్నమాట. హర్యానాలో ఒక్కో వ్యవసాయ కుటుంబంలో 59 మంది వ్యక్తులకు నెలవారీ ఆదాయం రూ. 14,434 లు మాత్రమే. అంటే తలసరి రూ. 2,450లు మాత్రమే రైతు కుటుంబాలకు అందుతున్నాయి. అయితే ఇంత తక్కువ ఆదాయం కూడా చాలామంది భారతీయ రైతులకంటే అధిక స్థానంలో హర్యానా రైతులను ఉంచుతోంది. ఉదాహరణకు గుజరాత్ రాష్ట్రంలో సగటు రైతు కుటుంబం ఆదాయం రూ. 7,926లు. ఇక్కడ కుటుంబంలో 52 మంది వ్యక్తులు ఉండొచ్చు. అంటే గుజరాత్ రైతు కుటుంబ తలసరి ఆదాయం రూ. 1,524లు మాత్రమే. భారతీయ రైతు కుటుంబాలు సగటు నెలవారీ ఆదాయం రూ. 6,426లు (తలసరి ఆదాయం రూ.1,300లు). పైగా ఈ సగటు నెలవారీ లెక్కలు కూడా రైతులకు అన్ని మార్గాల నుంచి వచ్చే ఆదాయ వనరులను కలిపే చెబుతుంటాయి.

ఇక సంపన్న రైతులే నిరసన చేస్తున్నారనే వాదన. ఢిల్లీ సరిహద్దుల్లో రెండు సెల్సియస్ డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో అక్కడే వండుకు తింటూ రోడ్లపైనే ట్రాక్టర్ల ట్రాలీల్లో నిద్రిస్తున్నవారు, అయిదు ఆరు డిగ్రీల చలిలో స్నానం చేస్తూ పదుల సంఖ్యలో మరణిస్తున్నవారు. ఈ భారతీయ సంపన్న రైతులు ప్రశంసలకు మరింతగా నోచుకుంటున్నారు. వీరు మనం ఊహించిన దాని కంటే కఠిన పరిస్థితులను తట్టుకోగలుగుతున్నారు. ఈలోగా రైతులతో చర్చించడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తనలో తాను చర్చించుకోవడం ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. నిరసన తెలుపుతున్న రైతులను బెదిరించడానికి, రెచ్చగొట్టడానికి చేసే ప్రతి ప్రయత్నమూ వారికి మద్దతునిచ్చే వారి సంఖ్యను పెంచుతోంది. రైతుల విశ్వసనీయతను దెబ్బ తీయడానికి ఉద్దేశించిన ప్రతి చర్య వ్యవస్థానుకూల మీడియాలో గొప్పగా ప్రచారం పొందుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం వ్యతిరేక ఫలితాలను పొందుతోంది. భయపెట్టే అంశం ఏమిటంటే రైతులకు అధిక మద్దతు లభించే కొద్దీ ప్రభుత్వం మరింత నిరంకుశంగా, పైశాచికంగా వారిపై దాడులు పెంచడానికి సిద్ధమైపోతోంది.

మనమెందుకు ఈ అంశం గురించి మాట్లాడకూడదు అనే ఒక్క ట్వీట్‌కు వచ్చిన అమిత స్పందన కూడా పాలకుల అహాన్ని కరిగించడం లేదు. మనమెందుకు దీనిపై మాట్లాడకూడదు అంటూ రిహానా చేసిన ఆ ఏకవాక్య ప్రకటన ఏ ఒక్క పక్షాన్నీ బలపర్చలేదు. ఐ.ఎమ్.ఎఫ్.చీఫ్ ఎకనామిస్ట్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఇద్దరూ నేరుగా సాగు చట్టాలను బలపరుస్తూనే రైతులకు సేఫ్టీ యంత్రాంగాలను అందించాలని సన్నాయి నొక్కు నొక్కారు. మత్తు పదార్థాల పొగాకు సంబంధించిన ప్యాకెట్లపై ఉండే అధికారిక హెచ్చరికకు మించిన విలువ వారి అభిప్రాయాలకు ఉండదనుకోండి. మొత్తం మీద ఆ అమెరికన్ పాప్ సింగర్, ఒక 18 ఏళ్ల స్కూల్ గర్ల్ కమ్ పర్యావరణ కార్యకర్త ఇప్పుడు దేశానికే ప్రమాదకర వ్యక్తులైపోయారు. వారిపై కఠిన చర్యలు తీసుకునే పనిలో మోడీ ప్రభుత్వ ఎత్తుగడలో మన ఢిల్లీ పోలీసులు మునిగిపోయారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతు ఆందోళనపై ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా అంతిమంగా రైతులు విజయం సాధించి తీరక తప్పదు.

మందా వెంకటేశ్వర్లు
(ఎఐటియుసి టిఎస్ ప్రధాన కార్యదర్శి)
9441775596

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News