Saturday, April 27, 2024

కుమారుడి గొంతు కోసి హత్యచేసిన తండ్రి

- Advertisement -
- Advertisement -

father killed his son in hyderabad

 

లంగర్‌హౌస్ పిఎస్ పరిధిలో సంఘటన

హైదరాబాద్: తండ్రే కుమారుడి గొంతు కోసి హత్య చేసిన సంఘటన నగరంలోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. లంగర్‌హౌస్, ప్రశాంత్ నగర్‌కు చెందిన హసిబ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆరు ఏళ్ల క్రితం హస్రత్‌బేగంతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గత కొంత కాలం నుంచి మానసికంగా బాగా లేకపోవడంతో హసిబ్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 4గంటలకు కోపంతో కత్తి తీసుకుని వెళ్లి పెద్ద కుమారుడు ఇస్మాయిల్(2)ను బిల్డింగ్ మొదటి అంతస్థులోకి తీసుకుని వెళ్లి గొంతు కోసి పరారయ్యాడు. ఇది గమనించిన హస్రత్ బేగం వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించింది. పరిశీలించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతిచెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం కోసం బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News