Saturday, April 27, 2024

రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో బిసి విద్యార్థుల ఫీజు చెల్లింపు

- Advertisement -
- Advertisement -

ఏటా 150 కోట్లకు పైగా అధనంగా బిసి విద్యకు కేటాయింపు
బిసిల సర్వతోముఖాభివ్రుద్దికి కెసిఆర్ సర్కార్ కృషి
ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మంత్రి గంగుల ధన్యవాదాలు

హైదరాబాద్ : అన్ని వర్గాల్లో బిసిల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మెరికల్లాంటి బిసి విధ్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాలు ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ వర్సీటీలు సహా 200కు పైగా ఇనిస్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన వారికి సంపూర్ణంగా ఫీజులను (ఆర్‌టిఎఫ్) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి ఆదేశించారు. గతంలో మన రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉండేదని ఈ విద్యా సంవత్సరం నుంచి బిసిలకు అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశం మేరకు అమలు చేస్తున్నామన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10వేల మంది బిసి విధ్యార్థులకు లబ్ది చేకూరుతుందని చెప్పారు. ఇందుకోసం అదనంగా ఏటా రూ. 150 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తుందని మంత్రి చెప్పారు.

ఇప్పటికే అంతర్జాతీయంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుకునే బిసి విద్యార్థులకు అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్‌తో పాటు రాష్ట్రంలోనూ ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నామని, ఇకనుండి దేశంలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లోని బిసి బిడ్డలకు సైతం పూర్తి ఫీజు అందించడంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బిసి విద్యార్థులకు పూర్తి ఫీజుల్ని చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే ఆసరా పెన్షన్లు, రైతుబందు, ఉచితకరెంటు తదితర పథకాల్లో మెజారిటీ వాటాతో పాటు ప్రత్యేకంగా వేలకోట్లతో ఆత్మగౌరవ భవనాలు, గ్రామాలు, పట్టణాల్లో కమ్యూనిటీ హాళ్లు, కుల వృత్తిదారుల ఆర్థిక స్వావలంబనకు లక్ష రూపాయల సహాయం, లక్షలాది బిసి బిడ్డలకు నాణ్యమైన ప్రపంచస్థాయి విద్యను అందించేలా 327 గురుకుల విద్యాలయాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నేడు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో చదివే బిసి బిడ్డలకు ఎస్‌సి, ఎస్‌టిల మాదిరి పీజు అందించడం సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు. ఇందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News