- Advertisement -
రంగారెడ్డి: రాజేంద్రనగర్ పరిధిలోని ఎంఎం పహాడి లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. కూలర్ తయారీ కంపెనీలోమంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కంపెనీలో షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపు చేసినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో రూ. 15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని యాజమాన్యం పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Fire Accident in Cooler Company At Rajendra Nagar
- Advertisement -