Friday, May 3, 2024

బిసి గురుకుల పాఠశాలలో చేపలకూర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని బిసి విద్యార్థులకు కెసిఆర్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. బిసి గురుకులాల్లో చేపల కూర పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు . దసరా తర్వాత బిసి గురుకులాల్లోని విద్యార్థులకు భోజనంలో చేపల కూర అందించాలని ఫిష్ ఫెడరేషన్ నిర్ణయించింది.

ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు ఫిష్  ఫెడరేషన్ చైర్మన్ రవీందర్ తెలిపారు. ఒక్కో విద్యార్థికి 150 గ్రాములు చొప్పున ప్రతి బుధవారం 15వేల మందికి చేపల కూర అందిస్తామన్నారు. ఇందుకు సంబంధించి స్కూళ్లలోని వంట మనుషులకు ఒక రోజు శిక్షణ ఇవ్వనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News