- Advertisement -
హైదరాబాద్లో కరోనా ఊహించని స్థాయిలో వ్యాపిస్తోంది. రోజుకు వందల్లో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ మహమ్మారి నుండి తప్పించుకోవడానికి గల ఒకటే మార్గం మనం దృఢంగా మారడమే అంటున్నారు హీరో నాగార్జున. ఫిట్గా, హెల్తీగా ఉండడం ద్వారా కరోనాను జయించవచ్చని ఆయన చెబుతున్నారు. దీనికోసం కోవిడ్ బారినపడి కోలుకున్న శిల్పా రెడ్డి వీడియో ఒకటి షేర్ చేశారు నాగార్జున. ఆ వీడియోలో శిల్పా రెడ్డి కొన్ని ఆసక్తికర విషయాలు, ఆమె అనుభవాలు తెలియజేశారు. శిల్పా రెడ్డి మాట్లాడుతూ “ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా నాకు కరోనా సోకింది. కరోనా సోకినప్పటికీ నాలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కనపడలేదు. ఫిట్గా ఉంటూ ఆరోగ్యంగా ఉండడం వల్ల ఎటువంటి చికిత్స లేకుండే కరోనాను జయించాను. వ్యాయామం ద్వారా ఆరోగ్యం ఉంటూ రోగ నిరోధక శక్తిని పెంచుకొని కరోనా వైరస్పై గెలవవచ్చు”అని పేర్కొంది.
- Advertisement -