Sunday, April 28, 2024

తెలంగాణ నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలోని నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఐదు భవనాలకు ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డులు వరించాయి. లండన్ కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ ఈ అవార్డులను ప్రకటించింది. మొజాంబాహీ మార్కెట్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదగిరిగుట్ట ఆలయానికి అంతర్జాతీయ అవార్డలు దక్కాయి.

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డులు వచ్చాయి. గ్రీన్ ఆర్గనైజేషన్ లండన్ లో ఈ నెల 16న అవార్డులు ఇవ్వనుంది. రాష్ట్రానికి ఐదు అంతర్జాతీయ అవార్డులు దక్కడంపై సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం తరుపున అవార్డులను అర్వింద్ కుమార్ అందుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News