Monday, April 29, 2024

కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి డి.శ్రీనివాస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని మాజీ మంత్రి డి.శ్రీనివాస్ ప్రకటించారు. చాలా రోజుల తర్వాత గాంధీ భవన్ కు రావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఆదివారం నాడు ఓ తెలుగు న్యూస్ చానెల్ కు డి.శ్రీనివాస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత తన స్వంత ఇంటికి వచ్చిన దాని కంటే ఎక్కువ సంతోషంగా ఉందని డి.శ్రీనివాస్ తెలిపారు. ఇవాళ ఉదయం కూడా డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో తాను చేరడం లేదని ప్రకటించినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా డి.శ్రీనివాస్ ప్రకటించారు. డి.శ్రీనివాస్ తో పాటు ఆయన పెద్ద కొడుకు సంజయ్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News