Saturday, April 27, 2024

డబుల్ లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: ఉప ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగ ంగా మున్సిపాలిటీకి 30కోట్లతో మంజూరైన డబుల్ రోడ్డు పనులకు మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలలో ఇచ్చిన హామిలను ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్, జిల్లా మ ంత్రి జగదీశ్‌రెడ్డిల ఆశీర్వాదంతో ఒకటొక్కటిగా నెరవేర్చుకుంటున్నామన్నారు.

చండూరు మున్సిపాలిటీకి 30కోట్లతో డబుల్‌లైన్‌రోడ్డు, బటర్‌ఫ్లై టైటింగ్ సిస్టమ్, డివైడర్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఉప ఎ న్నికలలో ఇచ్చిన హామి మేరకు మాట తప్పకుండా ఇచ్చిన మాట ప్ర కారం అభివృద్ధ్ది పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. అనంతరం మున్సిపాలిటీలోని అన్నివార్డులలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చండూరు పట్టణంలోని అంగడిపేటలో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు.

ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న,కౌన్సిలర్లు మంచుకొండ కీర్తి సంజయ్, కోడి వెంకన్న, అన్నపర్తి శేఖర్ ,కొండ్రెడ్డి యాదయ్య, చిలుకూరి రాధికా శ్రీనివాస్, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, పట్టణ అధ్యక్షులు భూతరాజు దశరథ, సైదులు, వివిద గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News