- Advertisement -
ఖమ్మం: వేరు వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పెను బల్లి మండలం తుమ్మల పల్లి వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడడంతో ఇద్దరు ఘటనా స్థలంలో చనిపోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఎపిలోని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందినవారిగా గుర్తించారు. ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు మరణించిన సంఘటన కల్లూరు మండలంలోని పోచారం గ్రామ శివారులో జరిగింది. మృతులు చిన్న కోరుకొండకు చెందిన రెడ్డి రామకృష్ణ, గోపిగా గుర్తించారు. రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
- Advertisement -