Saturday, April 27, 2024

లాక్‌డౌన్… పుట్టింట్లో భార్య… మాజీ ప్రియురాలితో ప్రియుడు పెళ్లి

- Advertisement -
- Advertisement -

 

పాట్నా: లాక్‌డౌన్ కారణంగా భార్య తన అమ్మగారింట్లో ఉండిపోయింది. దీంతో భర్త తన మాజీ ప్రియురాలును పెళ్లి చేసుకున్న సంఘటన బీహార్‌లోని పాలీగంజ్‌లో చోటుచేసుకుంది. దీంతో ఆ భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సంవత్సరం క్రితం ఓ యువతిని ధీరజ్ కుమార్ పెళ్లి చేసుకున్నాడు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ విధించే రెండు రోజుల ముందు భార్య తన అమ్మగారింటికి వెళ్లింది. లాక్‌డౌన్ విధించడంతో ఆమె అక్కడే ఉండిపోయింది. దీంతో భార్యను రావాలని పలుమార్లు ఫోన్ చేశాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆమె రాకపోవడంతో ఆగ్రహించిన అతడు తన మాజీ ప్రియురాలును పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Friend marry with Lover with wife in mother.s home
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News