- Advertisement -
ముంబై: పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహింకు చెందిన మహారాష్ట్ర రత్నగిరి జిల్లా లోని మూడు ఆస్తులు వేలంలో రూ.1.10 కోట్లకు అమ్ముడు పోయాయి. ఈ వారం మొదట్లో స్మగ్లర్స్ అండ్ ఫారెన్ ఎక్సేంజి మేనిప్యులేషన్స్ యాక్టు కింద ఈ వేలం జరిగినట్టు అధికారులు తెలిపారు. రవీంద్ర కాతే అనే బిడ్డరు ఈ ఆస్తులను పొంద గలిగాడు. దావూద్కు అతి సన్నిహితుండైన మరో గ్యాంగ్స్టర్ దివంగత ఇక్బాల్ మిర్చికి చెందిన ఆస్తులను కూడా వేలం వేస్తామని అడిషనల్ కమిషనర్ ఆర్ఎన్ డిసౌజా తెలిపారు.
- Advertisement -