Saturday, April 27, 2024

ఆకలినైనా భరిస్తాం.. ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఊరుకోం: గంగుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిసిలపై పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ బిసి నేతలు స్పందించాలని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం గంగుల మీడియాతో మాట్లాడారు. ఆకలినైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవం దెబ్బతీస్తే సహించమని, బిసి కులవృత్తులు లేకుండా మానవ మనుగడ లేదన్నారు. వెనుకబడిన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక సమానత్వం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన కులాలను, కులవృత్తులను ప్రభుత్వం వేలకోట్లతో అభివృద్ధి చేస్తుందని గంగుల కొనియాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లతో ఆత్మగౌరవ భవనాలు, వేలాది గురుకులాలను నిర్మించారని గుర్తు చేశారు.

Also Read: మేము అంటరానివాళ్లమా: “ఇండియా”పై ఎంఐఎం ఆగ్రహం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News