- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్ ప్రాంతాలు మినహా అన్ని జిల్లాల్లో కల్లుగీత కార్మికులు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ కల్లు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బుధవారం మెమో జారీ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. గీత కార్మికులు భౌతిక దురాన్ని పాటిస్తూ కల్లు విక్రయాలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది కల్లుగీత కార్మికులకు ఉపాధి అవకాశాలు ఉన్నాయని, 40 లక్షల మంది పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్కు మంత్రి గీతకార్మికుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -