- Advertisement -
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉల్లిధరలు పెరుగుతోన్న నేపథ్యంలో వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలపై నియంత్రణ విధించింది. ఈ మేరకు సవరించిన నిబంధనలతో పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హోల్సేల్ వ్యాపారి 250 క్వింటాళ్లు, రిటైలర్ 20 క్వింటాళ్ల ఉల్లి నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే దిగుమతి చేసుకునే వ్యాపారులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. అందుకు అనుగుణంగా గతంలో జారీ చేసిన ఉల్లి వ్యాపారుల అనుమతులు, నిల్వ, నియంత్రణ ఉత్తర్వులను ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -