- Advertisement -
బెంగాల్ సిఎం మమతాబెనర్జీ
కోల్కతా: బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ అవినీతిపరుడని, ఆయణ్ని ఆ పదవి నుంచి తొలగించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ డిమాండ్ చేశారు. 1996 హవాలా జైన్ కేసు చార్జిషీట్లో ధన్ఖర్ పేరు ఉన్నదని ఆమె తెలిపారు. ఇటువంటి వ్యక్తిని గవర్నర్గా కేంద్రం ఎలా కొనసాగిస్తున్నదని ఆమె ప్రశ్నించారు. ధన్ఖర్ను తొలగించాలని తానిప్పటికే పలు లేఖల్ని కేంద్రానికి రాశానని ఆమె గుర్తు చేశారు. ఇటీవల ఆయన ఉత్తర బెంగాల్లో పర్యటించారని, ఆ ప్రాంతాన్ని విభజించే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. అక్కడ ఆయన కేవలం బిజెపి ఎంపీలు, ఎంఎల్ఎలతో మాత్రమే భేటీ అయ్యారని ఆమె అన్నారు.
- Advertisement -