Wednesday, May 1, 2024

పివి బహుముఖ ప్రజ్ఞాశాలి: తమిళిసై

- Advertisement -
- Advertisement -

Governor tamil sai speech in PV Birth anniversary

హైదరాబాద్: మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై తెలిపారు. శతజయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా గవర్నర్​ తమిళిసై పివి విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహానేత పివి నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. పివి పేద ప్రజల పెన్నిధి అని, పివి విగ్రహాన్ని ఆవిష్కరించామని గర్వంగా చెప్పుకుంటామని, పివి శతజయంతి ఉత్సవం అందరికీ పండుగలాంటిదని తమిళసై తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సన్మానించుకోవాల్సిన వ్యక్తి పివి అని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News