Friday, April 26, 2024

గోనె సంచులు, టార్పాలిన్లు ఏర్పాటు చేసుకోండి

- Advertisement -
- Advertisement -

palla rajeshwar reddy

 

హైదరాబాద్: ప్రతి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు, కాంటాలు, టార్పాలిన్ ( తాడిపత్రి) తగు సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సూచించారు. ధాన్యం తీసుకుని వచ్చే రైతులు గుమికూడకుండా సామాజిక దూరం పాటించాలన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కరోనా వైరస్ కట్టడిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని మార్కెట్ కొనుగోలు కేంద్రాలను మూసి వేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు పండించిన పంట గ్రామ కొనుగోలు కేంద్రాలు తరలించడంతో పాటు వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

జిల్లా, మండల మరియు గ్రామాల రైతుబంధు సమితి అధ్యక్షులకు క్రియాశీలక పాత్ర నిర్వహించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద చేతులు శుభ్రం చేసుకోవడానికి తగు విధంగా సబ్బులు , శానిటైజర్, నీటిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రైతుబంధు సమితి సభ్యులు తమ గ్రామాల్లో రైతులు పండించిన పంటంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే భరోసా కలిగించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు పలు ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని పల్లా రాజేశ్వర్ రెడ్డిని కోరారు. వరి, మొక్కజొన్న కోత యంత్రాలను గ్రామాలలోకి తీసుకురావడానికి తగు అనుమతులను ఇచ్చి రైతులకు సహాయ సహకారాలను అందించాలన్నారు.

అలాగే వెటర్నరీ మందుల దుకాణాలను, విత్తన, ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తెరిచి ఉంచే విధముగా చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ కూలీలను అవసరమైన చోట ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తరలించే విధంగా అనుమతులు తీసుకోవాలని తెలిపారు. పశువుల దాణ తరలించే వాహనాలను గ్రామాలలోకి అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న పామ్ ఆయిల్ ఉత్పత్తి కంపెనీని నడిచే విధంగా చూడాలని కోరారు.

 

Grain buying center in every village
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News